హైదరాబాద్: 28°C
వార్తలు

ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. అమృత్‌సర్‌లోని భగ్తావాలా ధాన్యం మార్కెట్‌లో విధుల్లో ఉన్న ASI హర్జీత్ సింగ్‌పై ఇద్దరు దుండుగులు బైకుపై వచ్చి కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో కింద పడిన ASIని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.