హైదరాబాద్: 28°C
వార్తలు

8 మందిని సస్పెండ్‌ చేసిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

బ్రీత్ అనలైజర్ పరీక్షలో జాప్యం చేసిన పైలట్లు, సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ విమాన ప్రయాణం ముగిసిన తర్వాత నిర్దేశించిన రెండు గంటల వ్యవధిలోగా తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకోవాలి. కానీ ఈ పరీక్ష చేయించుకోని నలుగురు పైలట్లతో సహా 8 మంది సిబ్బందిని ఎయిరిండియా ఎక్స్ ‌ప్రెస్ సస్పెండ్ చేసింది.