హైదరాబాద్: 28°C
వార్తలు

మైనర్‌పై రేప్.. పీక్కుతిన్న కుక్కలు

ఢిల్లీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. 17 ఏళ్ల మైనర్‌ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఓ పొలంలో విసిరేశారు. ఆ మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతినడం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారిలో ముగ్గురు మైనర్లే కావడం గమనార్హం.