హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు తిరుమలలో గవర్నర్ పర్యటన

AP: తిరుమలలో ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గవర్నర్ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం కల్పవ‌ృక్ష వాహనసేవ, రాత్రికి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి తిరువీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.