హైదరాబాద్: 28°C
వార్తలు

50 లక్షలు దాటిన చార్‌ధామ్‌ యాత్రికులు

ప్రకృతి కన్నెర్రజేసినా భక్తుల విశ్వాసం చెక్కుచెదరలేదు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. హేమ్‌కుండ్‌ సాహిబ్‌(3.26L)తో కలుపుకుని 50.87L మంది పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఇందులో అత్యధికంగా బద్రీనాథ్‌ను 17.47L మంది దర్శించుకున్నారు. ఏప్రిల్‌ 19న మొదలైన ఈ యాత్ర నవంబర్‌ వరకు కొనసాగనుంది.