హైదరాబాద్: 28°C
వార్తలు

మహేశ్‌ కుమార్‌ గౌడ్ కీలక వ్యాఖ్యలు

TG: రాష్ట్రం 22-A భూముల వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ స్పష్టతనిచ్చారు. ఈ వ్యవహారంలో తప్పు కాంగ్రెస్‌ది కాదని, గత BRS హయాంలోనే భూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ భూ కుంభకోణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ అంశంపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ ఉంటుందా లేదా అనేది సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.