హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ స్వగ్రామం వాద్‌నగర్‌లో అమిత్ షా

ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన స్వగ్రామం గుజరాత్‌లోని వాద్‌నగర్‌ను సందర్శించారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని హాటకేశ్వర్ మహాదేవ్‌ను ప్రార్థించారు. అనంతరం 'సేవా సంకల్ప్ అభియాన్' పేరుతో 600 మందితో బైక్ యాత్రను ప్రారంభించారు. వీరు వాద్‌నగర్‌ నుంచి బయలుదేరి 7 రాష్ట్రాల మీదుగా యాత్ర చేస్తారు.