హైదరాబాద్: 28°C
వార్తలు

‘క్యాబ్‌లకు అడ్వాన్స్ టిప్ ఇవ్వకండి’

క్యాబ్‌ బుకింగ్ సమయంలో 'అడ్వాన్స్‌ టిప్‌' అడిగే విధానాన్ని వెంటనే ఆపేయాలని క్యాబ్‌ అగ్రిగేటర్లకు కేంద్రం స్పష్టం చేసింది. ఇదొక తప్పుదోవ పట్టించే విధానమని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే పేర్కొన్నారు. అడ్వాన్స్‌ టిప్‌ సహా పలు అక్రమ విధానాలను పాటిస్తున్నందుకు గానూ ర్యాపిడోకు రూ.10 లక్షల జరిమానా విధించినట్లు ఆమె వెల్లడించారు.