హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

అన్నమయ్య: గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో సిమెంట్‌ లోడుతో వెళ్తున్న లారీ ప్రహరీని ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. లారీలో మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ సజీవదహనమైనట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అటవీ ప్రాంతం కావడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.