హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జిగా కంచర్ల శ్రీకాంత్

అన్నమయ్య జిల్లా టీడీపీ ఇన్‌‌ఛార్జిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నియామకం చేపట్టారు. పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించి, క్యాడర్‌ను సమాయత్తం చేయడం ఆయన ప్రధాన బాధ్యత. ఐదు నియోజకవర్గాల్లో పార్టీని సమన్వయం చేసి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు.