హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,29,751 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 485 మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 21 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 2680 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.