హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిశుభ్రతతోనే ఆరోగ్య భద్రత: చైర్‌పర్సన్

MDK: రామాయంపేట మండల పరిషత్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకే ఇవ్వాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ నవనీత, కమిషనర్ రవీందర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.