PDPL: గోదావరిఖని ఏసీపీగా సీసీఎస్ ఏసీపీ టి. ప్రవీణ్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఏసీపీ మడత రమేష్ 10 రోజుల సెలవులో ఉండటంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ
గోదావరిఖని ఏసీపీగా ప్రవీణ్ కుమార్


