KNR: వీణవంక (M) భేతిగల్లో ఓ ఇంట్లో దుండగులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఏఎస్సై వెంకట్రెడ్డి వివరాల ప్రకారం.. కొక్కిరాల సంపతారావు ఈ నెల 3న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో అర తులం బంగారం, రెండు వెండి పళ్లాలు చోరీ అయినట్లు బాధితుడు తెలిపారు.
తెలంగాణ
తాళం వేసిన ఇంట్లో దొంగల చోరీ


