హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని వాహనం ఢీ.. ఒకరు మృతి

VKB: షాద్‌నగర్‌–పరిగి రోడ్డులో ఆదిత్య న్యూరో ఆస్పత్రి–హనుమాన్‌ టెంపుల్‌ మధ్య గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముష్టిపల్లి గ్రామానికి చెందిన కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై ఉన్న రవి, శ్రీకాంత్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ర్యాప్తు చేస్తున్నారు.