హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టౌన్‌ ప్లానింగ్‌, ఎంటమాలజీపై ప్రత్యేక దృష్టి'

MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌, ఎంటమాలజీ విభాగాల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన, ప్రజావాణి ఫిర్యాదుల్లో అధికంగా టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించినవే ఉంటున్నాయని తెలిపారు. పెండింగ్‌ ఫిర్యాదులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.