హైదరాబాద్: 28°C
వార్తలు

నదిని శుభ్రం చేసిన బిట్టూకు జాబ్‌ ఆఫర్‌

మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల బిట్టూ తబాహి అజ్నార్‌ నదిని ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి శుభ్రం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఈ యువకుడి పర్యావరణ పరిరక్షణపై చొరవ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెదర్లాండ్స్‌కు చెందిన ‘ది ఓషన్‌ క్లీనప్‌’ సంస్థ సీఈవో బోయన్‌ స్లాట్‌ బిట్టూకు ఉద్యోగ ఆఫర్‌ ఇచ్చారు.