హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జరిమానా

PDPL: రామగుండంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 16 మందిని శనివారం జీడీకే కోర్టులో హాజరుపరిచినట్లు ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. 15 మందికి రూ.41,500 జరిమానా విధించగా, కమ్యూనిటీ సర్వీసులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో శుభ్రత పనులు చేయించారు. మరో వ్యక్తికి వారం రోజుల జైలు శిక్ష విధించారు.