HYD: టీసీఎస్ ప్రతినిధుల బృందం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది. భవిష్యత్తులో ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం కీలక మౌలిక వసతులుగా మారుతాయని సీఎం తెలిపారు. తెలంగాణలో ఈ సామర్థ్యం అందుబాటులోకి రావడం రాష్ట్రానికే కాక దేశానికీ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలకమన్నారు.
వార్తలు
టీసీఎస్ ప్రతినిధులతో సీఎం భేటీ


