హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ భూమి ఆక్రమణ అడ్డగింత..PSకు తరలింపు

MLG: వెంకటాపురం అటవీ రేంజి ప్రగళ్లపల్లి బీటులో అటవీ భూమి ఆక్రమణకు శుక్రవారం యత్నించిన ఒడిశా సుకుమా జిల్లాకు చెందిన సుమారు 35 మంది ఆదివాసీలను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలోకి రావడం చట్టరీత్యా నేరమని హెచ్చరించి, వారిని ట్రాక్టర్‌లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదే బృందం గతంలోనూ ఇక్కడ మకాం వేసేందుకు ప్రయత్నించారన్నారు.