హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిరిండియా పైలట్‌పై వేటు

థాయ్‌లాండ్ నుంచి ఢీల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం తీవ్ర కుదుపులకు లోనైన ఘటనలో ఏఏఐబీ దర్యాప్తు కీలక నిజాలు వెల్లడించింది. విమానంలో పైలట్ డ్రగ్స్ వాడినట్లు గుర్తించింది. దీంతో అతడిని ఎయిరిండియా తక్షణమే విధుల నుంచి తొలగించింది. 36 వేల అడుగుల ఎత్తులో అకస్మాత్తుగా విమానం 300 అడుగులు కిందకు జారిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.