హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో పడి ఇద్దరు గల్లంతు

NLR: సంగం బెజవాడ కాశీరెడ్డి కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా దాసరిపాలెంకు చెందిన మోహన్‌, ఇబ్రహీం లైటింగ్‌ పనుల కోసం నెల్లూరుకు వచ్చారు. పనులు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు కాలువలో పడి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో ఇబ్రహీంను రక్షించారు. మోహన్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.