ATP: అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అమరావతికి వెళ్లనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించే కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొంటారు. జిల్లా అభివృద్ధి, పాలనా వ్యవహారాలలో మెరుగైన నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతికి జిల్లా కలెక్టర్ ఆనంద్


