హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనానికి హైడ్రా ముమ్మర ఏర్పాట్లు

HYD: నగరంలో సురక్షితంగా గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (IPS) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని 103 చెరువుల వద్ద నిమజ్జన పర్యవేక్షణ కోసం 51 డీఆర్ఎఫ్ బృందాలను, అత్యవసర సేవలకై 394 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. విగ్రహాల తరలింపునకు వీలుగా ప్రధాన మార్గాల్లో చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు.