BPT: అద్దంకి పట్టణంలోని ప్రధాన రహదారిపై ఒక అరుదైన దృశ్యం శుక్రవారం కనిపించింది. పట్టాలపై వెళ్లాల్సిన భారీ రైలు బోగీలు రోడ్డు మార్గాన ట్రాలీ లారీపై తరలిస్తున్నారు. రైలు బోగీలను చెన్నై నుంచి హైదరాబాద్ వైపు రోడ్డుపై తీసుకెళ్తుండగా స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఆ సమయంలో రహదారిపై ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అద్దంకిలో రోడ్డుపైకి వచ్చిన రైలు బోగీలు


