హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు కింద పడి వ్యక్తి మృతి!

కామారెడ్డి బ్రాహ్మణపల్లి రైల్వే గేటు వద్ద గురువారం రాత్రి రైలు కిందపడి సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.