కృష్ణా: ఎస్ఐఆర్లో భాగంగా అన్ని రకాల క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తహసీల్దార్, పురపాలక కార్యాలయాలు, బీఎల్వోలకు అభ్యంతరాలు సమర్పించాలన్నారు. 5, 6 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తామని, BLOలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల క్లెయిములకు 10 వరకు గడువు: ఆర్డీవో


