హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

GNTR: తెనాలిలో ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధం కారణంతో జరిగిన నాగ మహేష్‌ (53) కిడ్నాప్‌, హత్య కేసును పోలీసులు ఛేదించారు. బావమరిది పగడాల రాజేష్‌ రూ. 4 లక్షలకు సుపారీ ఇవ్వగా, ఆగస్టు 29న మహేష్‌ను కిడ్నాప్ చేసి చంపినట్లు ఎస్పీ తెలిపారు. మృతదేహం నుంచి 32 గ్రాముల బంగారం అపహరించి ఓలేరు ఇసుక క్వారీలో పాతిపెట్టిన ఘటనలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.