BHNG: ఆలేరు పట్టణంలోని షిరీడి సాయిబాబా ఆలయంలో గురువారం చోరీ జరిగింది. సాయిబాబా విగ్రహానికి అలంకరించిన రెండు వెండి కడియాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయంలోని సీసీ కెమెరాల ఆధారంగా దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలంగాణ
షిరీడి సాయిబాబా ఆలయంలో చోరీ!


