హైదరాబాద్: 28°C
వార్తలు

వరలక్ష్మీ వ్రతాల్లో మహిళలకు పవన్‌ కానుక

AP: పిఠాపురం పాదగయ క్షేత్రంలో జరిగే వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే మహిళలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక కానుకలు అందించనున్నారు. మహిళల కోసం 12 వేల చీరలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కల్యాణం శివశ్రీనివాసరావు తెలిపారు. చీరతో పాటు పసుపు, కుంకుమ, ఆలయంలోని రూపును కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు.