హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితా సవరణ గడువులోగా పూర్తి చేయాలి'

కృష్ణా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పెండింగ్‌ విచారణలను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లాలో 16.49% విచారణలు పెండింగ్‌లో ఉన్నాయని, గన్నవరంలో 24% ఉండటంతో అదనపు ఏఆర్‌ఓలను నియమించామని చెప్పారు.