హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం సేవించి డ్రైవింగ్‌.. భారీ ఫైన్‌

CTR: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఏడుగురికి న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించింది. ఎస్పీ తుషార్‌ డూడీ ఆదేశాలతో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వారు పట్టుబడ్డారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ పి. నరసింహరాజు సూచించారు.