పద్మావత్ మూవీ క్లైమాక్స్పై నటి స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మహిళలు, ఇతర మహిళలను గౌరవించడం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఆమె మాట్లాడిన తీరు, వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. హిందూ సమాజం, రాజ్పుత్ మహిళల్ని అవమానించేలా వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది. మరో వైపు బీహార్ బీజేపీ నేత ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు


