హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోన్ మాట్లాడతానంటూ తీసుకుని పరార్‌

NTR: ఫోన్ మాట్లాడాలని నమ్మించి సెల్‌ఫోన్లు తీసుకుని పరారవుతున్న ఘటనలు విజయవాడలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. దుండగులు అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలని చెప్పి వయస్సు పైబడిన వారిని, అమాయకులను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ ఇచ్చిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారవుతున్నారన్నారు. ఇటీవల బెంజ్ సర్కిల్,ట్రెండ్ సెట్ వద్ద ఫోన్లు లాక్కుని పరారైన విషయం తెలిసిందే.