హైదరాబాద్: 28°C
వార్తలు

అంత్యక్రియల తర్వాత కొడుకు రాక

ఒడిశాలోని దేంకానాల్‌ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. బార్షింగా గ్రామానికి చెందిన సనాతన్‌ నాయక్‌ (29) జులైలో కనిపించకుండా పోయాడు. పోలీసులు వరదలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని అతడిదిగా భావించి కుటుంబానికి అప్పగించారు. వారు అంత్యక్రియలు పూర్తి చేశారు. నెల రోజుల తర్వాత సనాతన్‌ ఇంటికి తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.