హైదరాబాద్: 28°C
వార్తలు

SEO సదస్సులో అరుదైన భేటీ

కిర్గిస్తాన్‌లో జరుగుతున్న SEO సదస్సులో అరుదైన భేటీ జరిగింది. చాలా రోజుల తర్వాత ప్రధాని మోదీతో రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఈ ముగ్గురు నేతలు ఒకే వేదికపై చేరి ఒకరినొకరు కరచాలనం చేసుకుని సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ ముగ్గురు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ నెలలోనే మోదీ, జిన్‌పింగ్ మరోసారి భేటీ కానున్నారు.