హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమారులపై వృద్ధుడి ఆవేదన.. ఆర్డీవోకు ఫిర్యాదు

VKB: లక్నాపూర్‌కు చెందిన హన్మంత్‌రెడ్డి తన ఇద్దరు కుమారులు భూమిని తీసుకుని ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపించారు. తినేందుకు అన్నం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వికారాబాద్‌ ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించి భూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఉంటున్నానని అధికారులకు తెలిపారు.