హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఓపీఎస్‌ పునరుద్ధరణకు ఉద్యోగుల నిరసన

KNR: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. జేఏసీ ఛైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలని, వెంటనే ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.