హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు సంచాలకుడిగా డీ.ఎస్‌. జగన్‌

HYD: తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డీ.ఎస్‌. జగన్‌కు అదనపు సంచాలకుడిగా పదోన్నతి లభించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖలోని సమాచార, పౌర సంబంధాల విభాగం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జాయింట్‌ డైరెక్టర్‌ హోదా నుంచి అదనపు సంచాలకుడిగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.