హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి తుమ్మల

TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు రామ్మోహన్, శివరాజ్‌సింగ్‌, షెకావత్, మనోహర్‌లాల్, అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ గురించి మాట్లాడనున్నారు. పప్పుధాన్యాలు, జొన్నల సేకరణకు సహకారం కోరనున్నారు.