హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాబాట కార్యక్రమంలో విద్యుత్ మరమ్మతులు

RR: లింగోజిగూడ ఓల్డ్ విలేజ్ శివపురి కాలనీలో మంగళవారం టీజీఎస్‌పీడీసీఎల్ సిబ్బంది ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 కేవీఏ డీటీఆర్ వద్ద అవసరమైన మరమ్మతు పనులు చేపట్టారు. బైరమల్‌గూడ ఏఈ పర్వతాలు, లైన్‌మెన్ చంద్రమౌళి, ఏఎల్‌ఎం పరంజ్యోతి, లైన్‌మెన్ కుమారస్వామి తదితరులు పాల్గొని విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు.