హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కోర్టులో ఈ నెల 12న జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు గోరికొత్తపల్లి SI త్రిలోక్‌నాథ్‌రెడ్డి ఇవాళ తెలిపారు. రాజీపడదగిన కుటుంబ వివాదాలు, బ్యాంకు లావాదేవీలు, చెక్‌బౌన్స్‌, చిన్నపాటి ప్రమాదాలు, గొడవలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తదితర కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు.