PPM: పాచిపెంట మండలంలోని పనుకువలసలో సచివాలయ భవన నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రూ. 35 లక్షలతో పనులు ప్రారంభించారు. రూ. 26 లక్షలు ఖర్చు చేసి స్లాబ్ వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రామ సచివాలయం గిడ్డంగిలో అవస్థల నడుమ నిర్వహిస్తున్నారు. ఈ సమస్యను జేఈ ఫరూక్ వద్ద ప్రస్తావించగా ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవస్థలకు ముగింపు ఎప్పుడు?


