హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా నిరుద్యోగులకు సువర్ణావకాశం

కర్నూల్ జిల్లా ఆదోని వన్‌టౌన్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ పి. విజయ తెలిపారు. కేస్‌ వర్కర్, పారామెడికల్‌ పర్సనల్, సైకోసోషల్‌ కౌన్సిలర్‌ పోస్టులు ఉన్నాయి. 18-39 ఏళ్ల వయసు, సంబంధిత విద్యార్హతలు, మూడేళ్ల అనుభవం ఉండాలి. సెప్టెంబర్‌ 6లోపు కలెక్టరేట్‌ 122వ గదిలో దరఖాస్తులు అందజేయాలి.