హైదరాబాద్: 28°C
వార్తలు

నేటితో ముగియనున్న మోదీ విదేశీ పర్యటన

ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. కిర్గిజ్ రిపబ్లిక్‌లో ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు అక్కడ జరిగే ప్రతిష్టాత్మక షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సులో పలు దేశాల అధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. సదస్సు అనంతరం ప్రధాని మోదీ తన పర్యటన ముగించుకుని భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.