హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశ్రమల అనుమతుల్లో వేగం పెంచాలి: DRO

KDP: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, అనుమతుల్లో జాప్యం చేయొద్దని DRO మల్లికార్జునుడు అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన 11,905 దరఖాస్తుల్లో 11,774కు అనుమతులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. పెండింగ్లో ఉన్న 36 దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించాలని డీఆర్‌వో సూచించారు.