హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

950 క్యూసెక్కుల నీరు విడుదల

BPT: సంతమాగులూరులో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువకు విడుదల చేసిన నీరు సోమవారం ప్రకాశం జిల్లా సరిహద్దులోని అద్దంకి బ్రాంచ్ కెనాల్ 18/0 మైలురాయికి చేరింది. 950 క్యూసెక్కుల నీరు చేరినట్లు సంతమాగులూరు ఎన్ఎస్‌పీ డీఈ లక్ష్మీనారాయణ తెలిపారు. 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి దిగువన ఉన్న 120 తాగునీటి చెరువులో నింపుతామన్నారు.