హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసారాంబాగ్ బ్రిడ్జిని ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్‌లో మూసారాంబాగ్ కొత్త హైలెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మూసీ నదిపై రూ. 52 కోట్ల వ్యయంతో, 400 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. గతంలో వర్షాకాలంలో మూసీ వరదలతో పాత కాజ్‌వే మునిగిపోయి రాకపోకలు నిలిచిపోయేవి. ఈ కొత్త బ్రిడ్జితో అంబర్‌పేట్, మూసారాంబాగ్ ప్రజలకు వరద, ట్రాఫిక్ కష్టాల నుండి శాశ్వత ఉపశమనం లభించనుంది.