హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల రైలు రాయితీ పునరుద్ధరించాలని వినతి

GDWL: అక్రిడిటెడ్ జర్నలిస్టులకు రైలు ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని వర్కింగ్ జర్నలిస్టులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. గద్వాల రైల్వేస్టేషన్ సందర్శనకు వచ్చిన మంత్రికి సోమవారం వినతిపత్రం అందజేశారు. రైల్వే పాసులు లేకపోవడంతో స్థానిక, దేశీయ ప్రయాణాల్లో ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.