హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ విమర్శలు

BHPL: భూపాలపల్లి పట్టణంలో సోమవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. సెప్టెంబర్‌ 2 నుంచి బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహిస్తామని తెలిపారు.